ETV Bharat / city

భూముల రీసర్వే కార్యక్రమానికి పేరు మార్పు

author img

By

Published : Nov 17, 2020, 3:21 PM IST

భూముల రీసర్వే కార్యక్రమాన్ని వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీసర్వే ప్రాజెక్టు కోసం 987.46 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి.

Land Re survey Name Changed in Andhra Pradesh
భూముల రీసర్వే కార్యక్రమం పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న భూముల రీసర్వే కార్యక్రమానికి.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. భూముల రీసర్వే ప్రాజెక్టు కోసం 987.46 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. డ్రోన్​లు, కార్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రీసర్వే కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములు, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లోనూ రీసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు.

ప్రాథమికంగా రెండు వందల కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రీసర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేందుకు 987.46 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. భూముల రీసర్వే గురించి డ్రోన్ల కోసం రూ.81 కోట్లు, కార్స్ నెట్ వర్క్ జిఎన్ఎస్ రోవర్లకు రూ.100 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సరిహద్దు రాళ్ల కోసమే రూ.600.62 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.