ETV Bharat / city

ఎంత నీరు అవసరమో చెప్పండి... తెలుగు రాష్ట్రాలను కోరిన కృష్ణా బోర్డు

author img

By

Published : Dec 26, 2020, 7:59 AM IST

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. వచ్చే ఏడాదికి ఎంత మేరకు కృష్ణా నది జలాలు అవసరమో తెలపాలని లేఖలో తెలిపారు. జనవరి 8 లోగా కావాల్సిన నీటి వాటాలను చెప్పాలని.. అదే సమయంలో ఈఏడాది డిసెంబరు వరకు ఎంత మేరకు కృష్ణా జలాలను వినియోగించుకున్నారనే వివరాలు సమర్పించాలని కోరారు.

Krishna board
Krishna board

వచ్చే సంవత్సరం మార్చి వరకు ఎంత మేరకు కృష్ణా నది జలాలు అవసరమో తెలపాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తాజాగా లేఖ రాశారు. జనవరిలో త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8 లోగా కావాల్సిన నీటి వాటాలను పేర్కొనాలని, అదే సమయంలో ఈఏడాది డిసెంబరు వరకు ఎంత మేరకు కృష్ణా జలాలను వినియోగించుకున్నారనే వివరాలు కూడా సమర్పించాలని కోరారు.

ఇదీ చదవండి: వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్‌ ఫిర్యాదు వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.