ETV Bharat / city

పాలేరు నుంచి బరిలో దిగుతా: ఖమ్మం నేతలతో షర్మిల

author img

By

Published : Mar 24, 2021, 7:06 PM IST

YS Sharmila
వైఎస్‌ షర్మిల

వైఎస్​ షర్మిలను ఖమ్మం జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులు కలిశారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల చెప్పినట్లు వెల్లడించారు.

వైఎస్‌ షర్మిల తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భారీ మోజార్టీతో గెలిపించుకుంటామని పాలేరు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ అభిమాని అర్జున్‌బాబు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఇవాళ వైఎస్‌ షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల 9న పార్టీ ప్రకటన తర్వాత పాలేరు నియోజకవర్గానికి రావాలని అభిమానులు ఆమెను కోరారు.

అందుకు షర్మిల తప్పుకుండా వస్తానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. పోటీపై స్పందించిన షర్మిల... వైఎస్ఆర్​కు పులివెందుల ఎలాగో... తనకు పాలేరు నియోజకవర్గం అలాగే అని చెప్పారని ఆయన వెల్లడించారు. ఏప్రిల్‌ 9న నిర్వహించనున్న సభకు దాదాపు లక్షకు పైగా హాజరవుతారన్నారు.

ఇదీ చదవండి:

'బంగారం లాంటి విశాఖ ఉక్కును అమ్మే యత్నాలు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.