ETV Bharat / city

కరోనా విజృంభిస్తున్న వేళ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదు: జనసేన

author img

By

Published : May 1, 2021, 9:51 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహించడమేంటని జనసేన.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే మొండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలలోకి నెట్టివేశారంటూ ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది.

janasena
janasena

కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ.. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన వీర మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది.

పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచనల మేరకు మహిళా నేతలు వారి వారి ఇళ్లలో దీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను రద్దు చేసిందని.. జగన్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని మహిళా నేతలు హితవు పలికారు. హైకోర్టు చెప్పిన విధంగా పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరాం: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.