ETV Bharat / city

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

author img

By

Published : Feb 10, 2021, 7:53 PM IST

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నిమ్మగడ్డ ప్రసాద్‌కు అనుమతి కోర్టు అనుమతి మంజూరు చేసింది.

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరగా.. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈనెల 11నుంచి ఆగస్టు 2వరకు హైదరాబాద్ దాటి వెళ్లొచ్చని చెప్పింది. రూ. 5 లక్షల బాండ్​ను సమర్పించాలని ప్రసాద్​ను సీబీఐ కోర్టు ఆదేశించింది. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు.. అరబిందో, ఇండియా సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ కేసుల విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఎమ్మార్ కేసు విచారణను ఈనెల 24కు, దాల్మియా సిమెంట్స్ కేసు విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: విశాఖలో గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ ఆసక్తి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.