ETV Bharat / city

TRANSGENDER: ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్​పై హైకోర్టులో విచారణ

author img

By

Published : Sep 6, 2021, 12:14 PM IST

Updated : Sep 7, 2021, 12:28 AM IST

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్న పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ
ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉద్యోగాల్లో ట్రాన్స్ జెంటర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ కర్నూలు జిల్లాకు చెందిన మహిమ అనే యువతి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సాల్మరాజు వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:

NARA LOKESH: 'పింఛన్లు పెంచుతామని తగ్గిస్తున్నారు..!'

Last Updated : Sep 7, 2021, 12:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.