ETV Bharat / city

సమస్యలకు నిలయాలుగా... విజయవాడలోని కొండ ప్రాంతాలు

author img

By

Published : Oct 3, 2022, 1:29 PM IST

Hilly areas in Vijayawada
విజయవాడలో కొండ ప్రాంతాలు

Hilly areas in Vijayawada: విజయవాడలో కొండ ప్రాంతాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. వానాకాలం వస్తే చాలు.. ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి. వీటికి తోడు పారిశుధ్య నిర్వహణాలోపం కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. విజయవాడలోని కొండ ప్రాంత వాసులు కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Hilly areas in Vijayawada: ఉపాధి కోసం జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారు పెరుగుతున్న అద్దెలను తట్టుకోలేక.. కొండ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జోరుగా వర్షాలు కురిస్తే కొండచరియలు విరిగి ఇళ్లపై పడతాయని తెలిసినా గుణదల, మొగల్‌రాజపురం, వన్‌టౌన్, గాంధీ పర్వతం, సొరంగ మార్గం, కబేళా వంటి ప్రాంతాల్లో లక్షల మంది నివాసం ఉంటున్నారు. వర్షా కాలంలో వీరంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. క్రీస్తురాజుపురం, చెరువు సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండపైకి వెళ్లాలంటే మెట్ల దారి కూడా లేని పరిస్థితి.

"క్రీస్తురాజు పురం, సొరంగం, చెరువు సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ నివసించే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతున్నాం. ఇవే ప్రాంతాల్లో గతేడాది కొండ చరియలు విరిగిపడి చాలా ప్రమాదాలు సంభవించాయి. అధికారులు తూతూమంత్రంగా వచ్చి హడావిడి చేయడం తప్ప, నియంత్రణా చర్యలు ఇప్పటికి తీసుకోలేదు" -స్థానికులు

ఏవైనా ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం తప్ప.. నియంత్రణా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. దోమల జోరుతో విష జర్వాల ప్రబలుతున్నాయి. కొండ చరియలు విరిగిపడకుండా కంచెను ఏర్పాటు చేయాలనికోరుతున్నారు.

విజయవాడలో కొండ ప్రాంతాలు

"విజయవాడ నగరంలో దాదాపు 2 లక్షల మంది వరకు కొండలపై నివాసం ఉంటున్నారు. కొండలపై సౌకర్యాలు తక్కువ అయినా ఇంటి అద్దెలను తట్టుకునేందుకు పేదలు నివాసం ఉంటున్నారు. చాలా ప్రాంతాల్లో కొండపైకి వెళ్లాలంటే మెట్ల దారి కూడా లేని పరిస్థితి ఉంది. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. సరైన పారిశుద్య నిర్వహణ లేకపోవడం వల్ల దొమలు వ్యాప్తి చెంది విషజర్వాల ప్రభలుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారడం లేదు." -స్థానికులు

అధికారులు మాత్రం కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. కొండ చరియలు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కంచెలు నిర్మిస్తామంటున్నారు. కొండ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.