ETV Bharat / city

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు.. నేడు విచారణ

author img

By

Published : Jun 15, 2022, 4:48 AM IST

ap high court
ap high court

రాజధాని రైతులకు ఏటా ప్రభుత్వం ఇచ్చే కౌలు సకాలంలో ఇవ్వట్లేదని దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. నిర్ణీత గడువులోగా కౌలు విడుదల చేయకపోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు.

రాజధాని రైతులకు ఏటా ప్రభుత్వం ఇచ్చే కౌలు సకాలంలో ఇవ్వకపోవడంపై అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల జీవనోపాధికి ప్రభుత్వం నిర్ణీత కౌలు నిర్ణయించి ఏటా మే 1వ తేదీ లోపు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 75/2016లో స్పష్టం చేసింది. 23 వేల మంది రైతులకు ఏటా రూ. 200 కోట్లు కౌలు రూపంలో చెల్చించనున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణీత గడువులోగా కౌలు విడుదల చేయకపోవటంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేడు ఈ పిటీషన్​పై ప్రముఖ న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించనున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకుడు పోతినేని శ్రీనివాసరావు.. హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

FLEXI ISSUE: కరకట్ట విస్తరణ పనులకు రైతుల అభ్యంతరం... భూముల్లోకి వస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.