ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన జీఎస్‌టీ ఆదాయం

author img

By

Published : Aug 2, 2021, 11:08 AM IST

GST revenue has increased in Telugu states
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన జీఎస్‌టీ ఆదాయం

దేశవ్యాప్తంగా ఎనిమిదోసారి లక్ష కోట్లకుపైగా రాబడి వచ్చింది. జులైలో జీఎస్‌టీ ఆదాయ లెక్కలను కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసింది. గతేడాది కంటే 33% అధికమని తెలిపింది. గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం ... తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగిందని వెల్లడించింది.

గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం జులైలో తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసిన జులై లెక్కల ప్రకారం.. ఆ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,730 కోట్లు, తెలంగాణకు రూ.3,610 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీకి గతేడాది జులైలో రూ.2,130 కోట్లు రాగా ఈసారి అది 28% వృద్ధి చెందింది. తెలంగాణకు క్రితం సారి రూ.2,876 కోట్లు రాగా ఈసారి అది 26% పెరిగింది. లక్షద్వీప్‌, పుదుచ్చేరిలు మినహా గతనెలలో అన్ని రాష్ట్రాలూ పాజిటివ్‌ వృద్ధిరేటు నమోదు చేశాయి.

గతేడాది జులైలో రాష్ట్రాలకు రూ.66,291 కోట్ల జీఎస్‌టీ ఆదాయం రాగా ఈసారి 32% పెరిగి రూ.87,678 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి జులైలో రూ.1,16,393 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది కంటే 33% అధికమని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇలా లక్ష కోట్లకుపైగా పన్ను వసూలు కావడం వరుసగా ఇది 8వ సారి.

ఇదీ చూడండి.

ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.