ETV Bharat / city

మరో ముప్పై ఏళ్లు జీఎంఆర్​ గ్రూప్​ చేతిలోనే... శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​

author img

By

Published : May 5, 2022, 1:49 PM IST

Rajiv Gandhi International Airport: రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 ఏళ్లు జీఎంఆర్​ గ్రూప్​ నిర్వహణలోనే ఉండనుంది. అంటే.. 2068 వరకు విమానాశ్రయ నిర్వహణ జీఎంఆర్​ గ్రూప్​దే అన్నమాట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ.. లేఖ పంపినట్టు జీఎంఆర్​ సంస్థ ప్రకటించింది.

Rajiv Gandhi International Airport
శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​

Rajiv Gandhi International Airport: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్​ గ్రూప్​ సంస్థే మరో 30 ఏళ్లు నిర్వహించనుంది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) సంస్థకు విమానాశ్రయ నిర్వహణ హక్కులు.. 2038 మార్చి 23వరకు ముగిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహణ హక్కుల గడువును మరో 30 ఏళ్ల పాటు పొడిగించాలని జీహెచ్​ఐఏఎల్​ దరఖాస్తు చేసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ లేఖ పంపినట్లు జీహెచ్‌ఐఏఎల్‌ ప్రకటించింది.

మరో 30 ఏళ్లు అంటే.. 2068 వరకూ ఈ విమానాశ్రయం జీహెచ్‌ఐఏఎల్‌ నిర్వహణలో ఉండనుంది. ప్రభుత్వంతో 2004, డిసెంబరు 30న కుదిరిన ఒప్పంద పత్రం (కన్సెషన్‌ అగ్రిమెంట్‌) ప్రకారం ఈ పొడిగింపు లభించినట్లు వివరించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌) అనుబంధ సంస్థ జీహెచ్‌ఐఏఎల్‌ నిర్మించి 2008 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తరణ పూర్తయితే ఈ విమానాశ్రయం నుంచి ఏటా 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వచ్చివెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఏటా 1.50 లక్షల టన్నుల సరకు రవాణాను నిర్వహించగల సామర్థ్యం రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి ఉంది.

ఇవీ చూడండి: Murudi Village Farmers: ఎమ్మెల్యే సోదరుడి కోసం... మా పొట్ట కొట్టొద్దు
తిరుమలలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.