ETV Bharat / city

Car Accident at Karimnagar: గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు..నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం

author img

By

Published : Jan 30, 2022, 9:20 AM IST

Updated : Jan 30, 2022, 9:39 AM IST

Car Accident at Karimnagar
గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు..నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం

Karimnagar Car Accident : తెలంగాణలోని కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున అదుపుతప్పిన వాహనం రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Karimnagar Car Accident : తెలంగాణలోని కరీంనగర్‌ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున అదుపుతప్పిన వాహనం రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

కేసు నమోదు

కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9 ఓవర్ స్పీడ్ చలాన్లు

ప్రమాదానికి గురైన కారును వదిలేసి నలుగురు యువకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కారుపై 9 ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పెళ్లి పేరుతో మోసం..మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా వల

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 30, 2022, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.