ETV Bharat / city

Telangana Omicron Cases: తెలంగాణలో విస్తరిస్తున్న ఒమిక్రాన్​.. కొత్తగా 5 కేసులు

author img

By

Published : Dec 31, 2021, 7:08 AM IST

omicron
omicron

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 67కు చేరుకుంది. ఇప్పటివరకు ఒమిక్రాన్​ బారిన పడిన 22 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

280 కరోనా కేసులు

corona cases: మరోవైపు రాష్ట్రంలో 24 గంటల్లో 37,926 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 280 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఒకరు మృతి చెందారు. తాజాగా కొవిడ్​ బారినపడిన మరో 206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

AP Omicron cases news:

ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్​ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది.

విదేశాల నుంచి ఏపీకి చేరుకున్న మరో 14 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 17 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో ముగ్గురికి నెగెటివ్​గా తెలింది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

AP Corona cases:

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,188 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 130 మందికి వైరస్ సోకగా..ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొవిడ్ నుంచి మరో 97 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

AP Omicron cases: రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు..17కు చేరిన మొత్తం కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.