ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 pm

author img

By

Published : Aug 13, 2020, 5:17 PM IST

.

5 pm top news
5pm ప్రధాన వార్తలు

  • రాష్ట్రంపై కరోనా పంజా

గడిచిన 24 గంటల్లో 9 వేల 9 వందల 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 82 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ' 48 గంటల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోయారో!'

సామాజిక మాధ్యమాల్లో తనపై వ్యక్తిగతంగా దూషించిన గుర్రంపాటి దేవేంద్రరెడ్డిపై తక్షమమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ డిమాండ్​ చేశారు. అలా జరగని పక్షంలో పార్లమెంటరీ ప్రివిలేజ్​ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!

రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలో పరిశ్రమల సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా-బంగాల్ తీరం వైపుగా కదిలే సూచన ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోడ్డుపై యాసిడ్​ ట్యాంకర్​ లీక్​.. అంతా భయం గుప్పిట్లో!

మధ్యప్రదేశ్​ రత్లాంలో ఓ యాసిడ్​ ట్యాంకర్​ లీకేజీకి గురైంది. ప్రధాన రహదారి మొత్తం తెల్లటి పొగ కమ్మేయటం వల్ల పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్​

పార్టీలో నెలకొన్న అపార్థాలను విడనాడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. సచిన్ ​పైలట్​ వర్గం సొంత గూటికి చేరిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్​ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్​ పోరాడుతోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వన్​టైం రుణ పునర్నిర్మాణం అమలు సాధ్యమేనా?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ఎస్ఎం​ఈ ఖాతాల వన్​టైం పునర్నిర్మాణ ప్రక్రియ అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో సంస్థల యజమానులు భవిష్యత్తు అంచనాలు వేయలేరని చెబుతున్నారు. అసలేమిటీ వన్​టైం రుణ పునర్నిర్మాణ ప్రక్రియ? మారటోరియం కన్నా ఎంతమేరకు అనువుగా ఉంటుంది? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • సగం ఆసుపత్రులు పనికిరాకుండా పోయాయి!

లెబనాన్ దేశానికి భారీ పేలుడు తీరని నష్టం కలిగించింది. పేలుడు జరిగిన బీరుట్ ప్రాంతంలో సగానికి పైగా ఆసుపత్రులు ధ్వంసం అయ్యాయి. ఆ ఘటనలో గాయపడినవారికి సైతం వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అజహర్​ మళ్లీ ఫామ్​లోకి వస్తాడు: వకార్​ యూనిస్​

సౌథాంప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​-పాకిస్థాన్​ మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభమైంది. అయితే ఫామ్ లేమితో​ సమస్యలు ఎదుర్కొంటున్న పాక్​ కెప్టెన్​ అజహర్​ అలీకి మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్​, బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. కచ్చితంగా మిగతా రెండు టెస్టుల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ జట్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మెగా డైరెక్టర్​తో బ్యాచిలర్​ బాబు నెక్ట్స్​ సినిమా?

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ తన తర్వాతి చిత్రం ప్రముఖ దర్శకుడు సురేందర్​ రెడ్డితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్​ కథకు కూడా ఓకే చెప్పేశాడట. ఇక సినిమా పట్టాలెక్కడమే ఉంది. ప్రస్తుతం కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.