ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Jun 12, 2020, 12:59 PM IST

.

1pm top news
1pm టాప్​ న్యూస్

  • పక్కా ఆధారాలతోనే...

తెదేపా హయాంలో మందుల కొనుగోలులో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధరణ అయిందని అనిశా అధికారులు వెల్లడించారు. ఫేక్ ఇన్వాయిస్‌తో మందులు కొనుగోలు చేశారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చెప్పినా వినలేదు

ఏలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని అచ్చెన్నాయుడి భార్య విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో ఫోన్​లో మాట్లాడిన చంద్రబాబు, లోకేశ్‌... పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేతల మండిపాటు

అచ్చెన్నాయుడు అరెస్ట్​ను పలువురు నేతలు ఖండించారు. బీసీలకు జగన్‌ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తున్నారనే కారణంగానే అరెస్టు చేశారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహిళపై వైకాపా నేత దాడి

కడప జిల్లాలో వైకాపా నేత మహబూబ్ బాషా రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళపై దాడి చేశాడు. తనకు ఎదురుగా వచ్చిందన్న కారణంతో విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు. స్థానికులు అడ్డుకున్నా వినలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చర్యలు తీసుకోవద్దు

లాక్​డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించింది సుప్రీం కోర్టు. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత పౌరుడు మృతి

భారత పౌరులపై నేపాల్​ పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అదుపులోకి రాని మంటలు...

అసోం టిన్సుకియా జిల్లాలోని చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉన్నందున సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డాలర్ కలలకు బ్రేకులు

హెచ్​-1 బీ వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెరుగుదల సమస్యలతో అమెరికా సతమతమవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐఓఏ అధ్యక్షుడి ఇంట్లో ఎనిమిదో వ్యక్తికి కరోనా

ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా ఇంట్లో ఎనిమిదో వ్యక్తి తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన ఇంట్లోని మిగతా సభ్యులు, ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఫాతిమా మహల్' కోసం అమితాబ్, ఆయుష్మాన్

అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గులాబో సితాబో' ఎలా ఉంది? అమితాబ్, ఆయుష్మాన్ కలిసి ఎంతవరకు అలరించారు? తదితర విశేషాల కోసం ఈ రివ్యూ చదివేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.