ETV Bharat / city

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

author img

By

Published : Oct 10, 2020, 10:38 AM IST

Updated : Oct 10, 2020, 1:28 PM IST

ఎంసెట్‌ ఫలితాలు
ఎంసెట్‌ ఫలితాలు

10:36 October 10

ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్​

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.78 శాతం ఉత్తీర్ణత సాధించగా...ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 91.77 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌లో 1,33,066 మంది, ఎంసెట్‌ వ్యవసాయ, ఫార్మసీలో 69,616 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ మొదటి 10 ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణకు చెరో 5 ర్యాంకులు వచ్చాయి. వ్యవసాయ, ఫార్మసీ మొదటి 10 ర్యాంకుల్లో ఏపీ 8, తెలంగాణ 2 ర్యాంకులు సాధించాయి. కౌన్సెలింగ్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. 

ఇంజినీరింగ్‌లో.....

  • మొదటి ర్యాంకు - వావిలపల్లి సాయినాథ్‌(విశాఖ)
  • రెండో ర్యాంకు - కుమార్‌ సత్యం(రంగారెడ్డి)
  • మూడో ర్యాంకు - గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూరు)
  • నాలుగో ర్యాంకు - ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)
  • ఐదో ర్యాంకు - సిహెచ్‌.కౌశల్‌కుమార్‌రెడ్డి (సికింద్రాబాద్‌)
  • ఆరో ర్యాంకు - కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
  • ఏడో ర్యాంకు - వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
  • ఎనిమిదో ర్యాంకు - హార్దిక్‌ రాజ్‌పాల్‌(రంగారెడ్డి)
  • తొమ్మిదో ర్యాంకు - కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
  • పదో ర్యాంకు - లండ జితేంద్ర(విజయనగరం)

వ్యవసాయ, ఫార్మసీలో.....

  • మొదటి ర్యాంకు - గుత్తి చైతన్య సింధు(తెనాలి)
  • రెండో ర్యాంకు - త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి(తాడికొండ-గుంటూరు)
  • మూడో ర్యాంకు - వి.మనోజ్‌కుమార్‌(తిరుపతి)
  • నాలుగో ర్యాంకు - దర్శి విష్ణుసాయి(నెల్లూరు)
  • ఐదో ర్యాంకు - ఆవుల షుభాంగ్‌ (రంగారెడ్డి)
  • ఆరో ర్యాంకు - సింగిరెడ్డి హవిష్‌రెడ్డి(మేడ్చల్‌)
  • ఏడో ర్యాంకు - ఎర్రగుడి లిఖిత (కడప)
  • ఎనిమిదో ర్యాంకు - జాడ వెంకట వినయ్‌(కడప)
  • తొమ్మిదో ర్యాంకు - సొగనూరు నితిన్‌ వర్మ(కర్నూలు)
  • పదో ర్యాంకు - మురికిపూడి రేవంత్‌(గుంటూరు)
Last Updated : Oct 10, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.