ETV Bharat / city

పోలవరం నిర్వాసితులను అడ్డుకున్న దిల్లీ పోలీసులు

author img

By

Published : Aug 4, 2021, 4:37 AM IST

Delhi police intercept Polavaram residents
పోలవరం నిర్వాసితుల అడ్డుకున్న దిల్లీ పోలీసులు

తమ గోడు చెప్పుకునేందుకు దిల్లీ వెళ్లిన పోలవరం నిర్వాసితులను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ ధర్నాకు అనుమతులు లేవని చెప్పి వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు పోలవరం బాధితులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకోవాలని దిల్లీలో ధర్నా చేపట్టడానికి వెళ్లిన పోలవరం నిర్వాసితులను అక్కడి పోలీసుల అడ్డుకున్నారు. ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయడానికి మంగళవారం సాయంత్రం దిల్లీ చేరుకున్న నిర్వాసితులను ఇక్కడ ఉండటానికి వీళ్లేదంటూ పోలీసులు అండ్డుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నిజాముద్దీన్​ రైల్వే స్టేషన్​ నుంచి అక్కడి కరోల్​భాగ్​లోని ఓ హోటల్​కు చేరుకున్న పోలవరం బాధితుల వద్దకు దిల్లీ పోలీసుల వచ్చి ఆధార్ కార్డులు పరిశీలించి.. దిల్లీ ధర్నాకు అనుమతులు లేవని చెప్పి వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు పోలవరం బాధితులు తెలిపారు.

ఇదీ చదవండి..

SOMU: 'చట్టాలకు విరుద్ధంగా ఏపీ రూ.25 వేల కోట్ల అప్పులు'..కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.