ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు: రఘురామ పిటిషన్​పై 27న నిర్ణయం

author img

By

Published : Apr 22, 2021, 3:53 PM IST

జగన్ బెయిల్ రద్దుచేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​ విచారణార్హతపై ఈనెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని రఘురామ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ అర్హతపై నిర్ణయాన్ని ఈనెల 27కి వాయిదా వేసింది.

రఘురామ పిటిషన్​పై 27న నిర్ణయం
రఘురామ పిటిషన్​పై 27న నిర్ణయం

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టాలా..? వద్దా..? అనే అంశంపై ఈనెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. కోర్టు విధించిన బెయిల్ షరతులు జగన్ ఉల్లంఘించారని.. రద్దు చేయాలని ఆయన పిటిషన్​లో కోరారు. ముఖ్యమంత్రిగా ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ మాత్రమే బెయిల్ రద్దు చేయాలని కోరాలని ఏమీ లేదని.. ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చునని వాదించారు. పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పేర్కొందని వివరణ ఇచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ అర్హతపై నిర్ణయాన్ని ఈనెల 27కి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... దేవినేనిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.