ETV Bharat / city

Jagan bail: జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం.. అందుకే లేఖలు: నారాయణ

author img

By

Published : Jun 5, 2021, 3:35 PM IST

జగన్ బెయిల్ (jagan bail) రద్దయ్యే అవకాశం ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ నేపథ్యంలోనే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకోసమే వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖలు రాశారని ఆరోపించారు. కేంద్రంపై పోరాడే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cm ys jagan letters to chief ministers
cpi narayana comments on cm ys jagan

సీపీఐ నారాయణ

ముఖ్యమంత్రి జగన్ (cm jagan ) తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (cpi narayana) విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కోసం ఒకే స్వరం వినిపిద్దామంటూ సీఎంలకు లేఖలు రాసిన జగన్‌(jagan) .. ప్రధాని (pm modi)ని విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం (jharkhand cm) ట్వీట్‌ను ఎందుకు తప్పుపట్టారని ప్రశ్నించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నందున.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'కేసుల విషయంలో జరగబోయే పరిణామాల నుంచి బయటపడేందుకే జగన్ వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖ రాశారు. నిజంగా వ్యాక్సిన్లపై చిత్తశుద్ధి ఉంటే జార్ఖండ్ సీఎంను ఎందుకు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, జీఎస్టీతో పాటు ప్రజావ్యతిరేక విధానాల అంశాల్లో కేంద్రంపై ఎందుకు పోరాటం చేయటం లేదు...? కేంద్రంపై పోరాడే విషయంలో జగన్​కు చిత్తశుద్ధి లేదు' - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

తెరాసకే నష్టం...

మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatela Rajender) వ్యవహారంపై నారాయణ(narayana) స్పందించారు. ఈటల భాజపాలోకి వెళ్తే తెరాస( TRS)కే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ మరో పశ్చిమబంగాల్​లా మారకుండా కేసీఆర్ (KCR) జాగ్రత్త పడాలని సూచించారు. లక్షదీవుల (lakshadweep)ను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈనెల 8న లక్షద్వీప్ ప్రజల పోరాటానికి సంఘీభావంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జీజీహెచ్​లో లైంగిక వేధింపులపై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.