ETV Bharat / city

కేంద్ర ప్యాకేజీతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ

author img

By

Published : May 17, 2020, 10:42 AM IST

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ.. విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు.

cpi leader ramakrishna
cpi leader ramakrishna

కేంద్ర ఆర్థిక ప్యాకేజీతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదని సీపీఐ నేత కె. రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్యాకేజీ.. ప్రభుత్వ రంగాన్ని ప్యాకింగ్ చేసి పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు.

హామీ లేకుండా రుణాలు ఇస్తామన్నారేగానీ.. వడ్డీ లేకుండా ఇస్తామనలేదని ఎద్దేవా చేశారు. స్వదేశీ జపం చేస్తూనే విదేశాలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

దేశంలో కరోనా కొత్త రికార్డ్- ఒక్కరోజులో 4987 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.