ETV Bharat / city

AP Corona News: రాష్ట్రంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

author img

By

Published : Mar 18, 2022, 7:43 PM IST

AP Corona News
AP Corona News

CORONA CASES IN AP: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 46 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యార్యోగశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 75 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 46 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 536 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,846 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

AP Corona News
AP Corona News

దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

Covid Cases In India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు స్థిరంగా నమోదవుతున్నా. కొత్తగా 2,528 మందికి వైరస్​ సోకింది. అయితే మరణాలు మాత్రం క్రితం రోజుతో(60) పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,997 వైరస్​ను జయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40శాతం ఉంది.

  • మొత్తం కేసులు: 4,30,04,005
  • మొత్తం మరణాలు: 5,16,281
  • యాక్టివ్​ కేసులు: 29,181
  • కోలుకున్నవారు: 4,24,58,543

Vaccination in India : దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గురువారం మరో 15,77,783 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,97,94,588కు పెరిగింది.

Covid Tests: దేశంలో గురువారం 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించారు.


ఇదీ చదవండి : Tenth Class Exams : మారిన పది పరీక్షల షెడ్యూల్...ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ ఎగ్జామ్స్...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.