ETV Bharat / city

మరో 4 రోజుల్లో వింత వ్యాధి నిర్ధరణ: వైద్యారోగ్యశాఖ కమిషనర్‌

author img

By

Published : Dec 11, 2020, 6:13 PM IST

ఏలూరు వింత వ్యాధి నిర్ధరణకు మరో 4 రోజుల సమయం పడుతుందని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్ తెలిపారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన... వివరాలు వెల్లడించారు. ఏలూరు తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. రక్త నమూనాల్లో సీసం, నికెల్ అధికంగా ఉందని తేలిందన్నారు.

cm jagan review on mystery illness in eluru
cm jagan review on mystery illness in eluru

ఏలూరు వింత వ్యాధిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనకు గల కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్​, వైద్యులతో పాటు వివిధ జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పరిశోధన ఫలితాలను ముఖ్యమంత్రికి తెలిపారు

ఏలూరు ఘటనకు గల కారణాలు ప్రస్తుతం నిర్ధరణ కాలేదని వైదారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ అన్నారు. మరికొన్ని పరిశోధన ఫలితాలు అందాల్సి ఉందని చెప్పారు. వింత వ్యాధి నిర్ధరణకు మరో 4 రోజులు పడుతుందని వెల్లడించారు. తాగునీటి సమస్య లేదు.. ఇది వ్యాధి కాదు.. రియాక్షన్ మాత్రమే అని స్పష్టం చేశారు. తాగునీటిలో సీసం, నికెల్ లేదని తేలిందని వివరించారు. ఆహారంలో సీసం, నికెల్ ఉండవచ్చని తేలిందని పేర్కొన్నారు.

'ఏలూరు తాగునీటిలో ఎలాంటి సమస్య లేదు. ఆహారం వల్ల వింత వ్యాధి వ్యాప్తి జరిగి ఉండవచ్చని భావిస్తున్నాం. ఆహారంలో వివిధ కారకాలు కలవడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందింది. పురుగు మందుల వల్ల వ్యాప్తి జరిగి ఉండవచ్చని భావిస్తున్నాం. రక్త నమూనాల్లో సీసం, నికెల్ అధికంగా ఉండటంతో పాటు... బియ్యంలో మెర్క్యూరీ ఉన్నట్లు తేలింది. గాలిలో ఎలాంటి కారకాలు లేవు. వైరస్, బ్యాక్టీరియా వల్ల వింత వ్యాధి వ్యాప్తి చెందలేదు. కేసుల నమోదు ఉన్నంత వరకు వైద్య శిబిరాలు కొనసాగిస్తాం'- భాస్కర్‌, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌

ఇదీ చదవండి

కర్రలు, కత్తులతో మత్స్యకారుల దాడి.. 15మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.