ETV Bharat / city

నేడు పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

author img

By

Published : Mar 18, 2021, 6:28 AM IST

నేడు పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజధాని భూముల విషయంలో సీఐడీ నోటీసుల వంటి ముఖ్య అంశాలను చర్చించే అవకాశం ఉంది.

cbn
నేడు పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. తిరుపతి ఉపఎన్నిక, రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి సీఐడీ ఇచ్చిన నోటీసులకు తదుపరి కార్యాచరణ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమీక్ష తదితర అంశాలపై నేతలతో చర్చించనున్నారు.

ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నందున తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నేతలతో మధ్యాహ్నం సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు లోటుపాట్లను చర్చించనున్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.