ETV Bharat / city

'అనుమతి వేగంగా వస్తే.. కొవాగ్జిన్​ తొందరగానే అందుబాటులోకి వచ్చేది'

author img

By

Published : Feb 24, 2022, 9:19 PM IST

Bio Asia Summit at hyderabad
Bio Asia Summit at hyderabad

Bio Asia Summit: భారత్​లో వ్యాక్సిన్ల అభివృద్ధిలో అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమైతే.. తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్​ టీకా ఇంకా ముందే అందుబాటులోకి వచ్చేదని భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. బయో ఆసియా సద్ససులో భాగంగా నిర్వహించిన 'టూ ఇయర్స్ ఇన్ పాండమిక్' ప్యానల్ డిస్కషన్​లో ఆయన పాల్గొన్నారు.

Bio Asia Summit: నేడు నిర్లక్ష్యం చేసిన వ్యాధులే.. రేపు ప్రాణాంతక మహమ్మారులుగా ప్రబలుతాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. బయో ఆసియా సద్ససులో భాగంగా నిర్వహించిన 'టూ ఇయర్స్ ఇన్ పాండమిక్' ప్యానల్ డిస్కషన్​లో ఆయన పాల్గొన్నారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇలాంటి వ్యాధులే పాండమిక్​గా రూపుదాల్చాయంటూ ఆయన ఉదహరించారు. పరిస్థితులు చేజారకుండా ఉండాలంటే.. వ్యాక్సిన్ తయారుదారులు, పాలసీ మేకర్స్.. వీటిపై దృష్టిసారించాలని కృష్ణ ఎల్ల సూచించారు. భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేస్తోన్న ట్యూబర్కులోసిస్ (TB) వ్యాక్సిన్​.. ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరో వారంలో దీనిపై ప్రకటన ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకున్న బీఎస్ఎల్-3 తయారీ కెపాసిటీని.. తమ భాగస్వామ్యంతో ప్రపంచ దేశాలు వినియోగించవచ్చని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

ట్రాక్​ రికార్డ్​..

భారత్​లో వ్యాక్సిన్ల అభివృద్ధిలో అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమైతే.. తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్​ టీకా ఇంకా ముందే అందుబాటులోకి వచ్చేదని భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. వైరల్, ఇనాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్ల తయారీలో తమకున్న ట్రాక్​ రికార్డుతోనే కొవిడ్​ వ్యాక్సిన్​ తయారీకి నడుంబిగించామని ఆయన తెలిపారు. భారత్​ బయోటెక్​కు ఉన్న సానుకూలతలు, పూణా వైరాలజీ, ఐఐసీటీ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. 26 వేలకు పైగా మందికి వ్యాక్సిన్ ఎఫికసీ ట్రయల్స్ నిర్వహించామన్నారు. పిల్లల్లో వ్యాక్సినేషన్ సులభమని.. అదే పెద్దల్లో అయితే ఇది సవాల్​తో కూడుకున్నదని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

ఈ సదస్సులో కృష్ణ ఎల్లతో పాటు, బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేశ్​ గోఖలే పాల్గొన్నారు.

కొవిడ్​ పైనే ఫోకస్​ చేయడం సమస్యే..

ప్రాంతాలకతీతంగా ఎంఆర్ఎన్​ఏ టెక్నాలజీ, ఆర్​అండ్​డీ సెంటర్లను అభివృద్ధి చేసుకోవాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. వ్యాక్సిన్ సప్లై చైన్ అంతా కొవిడ్-19 పైనే ఫోకస్ చేయటం సమస్యే అని.. కెపాసిటీ బిల్డింగ్, వాల్యూమ్ ఇంక్రీజింగ్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని మహిమా దాట్ల తెలిపారు. భారత కంపెనీలు వ్యాక్సిన్లు, ఫార్మా ఉత్పత్తులతోపాటు.. కాంప్లెక్స్ జనరిక్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ వంటి అంశాలపై మరింత దృష్టిసారించాలని నీతి అయోగ్ సీఈవో అమితాబ్​కాంత్​ సూచించారు. వ్యాక్సిన్ల అనుమతి ప్రక్రియలో ఆలస్యంపై బయోటెక్నాలజీ శాఖ సెక్రటరీ రాజేశ్​ గోఖలే స్పందించారు. సమగ్రమైన డేటా, చట్టాలకు లోబడి చేయటం పనిచేయడం వల్లనే వ్యాక్సిన్​ అనుమతుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. వెంచర్​ కాపిటలిస్ట్​ల మాదిరిగా వేగంగా అనుమతుల ప్రక్రియ జరగాలంటే సాధ్యపడదని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: Bio Asia Summit: హైదరాబాద్​ వేదికగా...19వ బయో ఆసియా సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.