ETV Bharat / city

Pub Case: 'పబ్​లో దొరికిన డ్రగ్స్​కు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు..'

author img

By

Published : Apr 19, 2022, 10:07 PM IST

పుడింగ్ పబ్ కేసు
పుడింగ్ పబ్ కేసు

Hyderabad Pub Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుడింగ్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిందితులుగా ఉన్న అభిషేక్​, అనిల్​ బెయిల్​ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. పబ్​లో దొరికిన డ్రగ్స్​కు.. అభిషేక్, అనిల్​కు ఎలాంటి సంబంధం లేదని వాళ్ల తరఫు న్యాయవాది వాదించారు. ఇద్దరికీ బెయిల్​ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

Hyderabad Pub Case: హైదరాబాద్​లోని పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్​ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిందితులిద్దరికీ బెయిల్ ఇవ్వాలని అభిషేక్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. పబ్​లో దొరికిన మాదకద్రవ్యాలకు... అభిషేక్, అనిల్​కు ఎలాంటి సంబంధం లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. రేపు పోలీసుల తరఫు న్యాయవాది వాదించనున్నారు.

ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పంజాగుట్ట మాదకద్రవ్యాల కేసులో నిందితులుగా ఉన్నవాళ్లకు, పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. పంజాగుట్ట కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ.. ఏజెంట్ల సాయంతో హైదరాబాద్, బెంగళూరు, గోవా, ముంబయిలో మాదకద్రవ్యాలు సరఫరా చేశాడు. బాబూషేక్, నూర్​మహమ్మద్ అనే ఏజెంట్లు హైదరాబాద్​లో 12 మంది వ్యాపారులకు డ్రగ్స్​ సరఫరా చేయడానికి వచ్చి టాస్క్​ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు.

పలు పబ్​లకు కూడా బాబూషేక్, నూర్​మహమ్మద్ మాదకద్రవ్యాలు సరఫరా చేసనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబూషేక్ వద్ద డ్రగ్స్​ తీసుకున్న కొందరు వ్యాపారులకు... పుడింగ్ పబ్ నిర్వాహకులకు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం పరిచయం వరకు ఆగిపోయిందా..? లేక ఏమైనా లావాదావేలు నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.