ETV Bharat / city

AP Raj Bhavan : గవర్నర్​కు ప్రముఖుల శుభాకాంక్షలు

author img

By

Published : Jan 1, 2022, 4:34 PM IST

rajbhavan
rajbhavan

AP Raj Bhavan: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

AP Raj Bhavan: రాజ్ భవన్​లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ రూపొందించిన 2022 సంవత్సర కాలమానిని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో కలికి వచ్చి గవర్నర్​కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను అశీర్వదించి శ్రీవారి ప్రసాదం అందించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పైల సోమినాయిడు, ఈవో భ్రమరాంబ తదితరులు గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి తరుపున గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ , డీజీపీ గౌతమ్​ సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, పోలీసు ఉన్నతాధికారులు.. బిశ్వభూషణ్ హరించందన్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి :

''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.