ETV Bharat / city

బార్లపై 20 శాతం కొవిడ్ రుసుము

author img

By

Published : Sep 18, 2020, 8:59 PM IST

Updated : Sep 19, 2020, 3:52 AM IST

కొవిడ్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సడలిస్తుండటం వల్ల రాష్ట్రం బార్లకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లను తెరుచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శనివారం నుంచి బార్ లైసెన్సులను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. బార్లను తెరుచుకునేందుకు లైసెన్సు ఫీజుపై 20 శాతం మేర కొవిడ్ రుసుం చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లలో విక్రయించే మద్యానికి 10 శాతం మేర అదనపు రిటైల్ టాక్స్​ను విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ap-govt-has-give
ap-govt-has-give

రాష్ట్రవ్యాప్తంగా బార్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 840 బార్లు శనివారం నుంచి తెరుచుకోనున్నాయి. 2021 జూన్ 30 తేదీ వరకూ ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను పునరుద్ధరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి ప్రతీ ఏటా 10 శాతం మేర లైసెన్సు ఫీజు కింద చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే బార్లలో విక్రయించే భారత్​లో తయారైన విదేశీ మద్యంతో పాటు విదేశీ మద్యం, బీర్లు, వైన్స్​ అలాగే రెడీ టూ డ్రింక్ మద్యం వెరైటీలపై 10 శాతం మేర అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్​ను విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బార్లలో జరిగే విక్రయాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధిస్తున్నట్టు పేర్కొంది.

20 శాతం కొవిడ్ రుసుం

2020 సెప్టెంబరు 19 తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్​లో పేర్కొంది. దీంతో పాటు కొవిడ్ ఫీజు కింద బార్ లైసెన్సులపై 20 శాతం మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. బార్ లైసెన్సు ఫీజులోని తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఛార్జ్ స్లాబ్ ఆధారంగా ఈ 20 శాతం కొవిడ్ ఫీజును విధిస్తున్నట్టు అబ్కారీశాఖ పేర్కొంది. పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుకు గానూ అదనపు ఆదాయం కోసం పన్నులు, ఫీజులను పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ప్రతీ బార్ లైసెన్సు నుంచి 20 శాతం మేర తిరిగి చెల్లించని రిజిస్ట్రేషన్ ఛార్జి కింద కొవిడ్ ఫీజును విధిస్తున్నట్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాల రీత్యా ఎక్సైజ్ చట్టం కింద ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు 19 సెప్టెంబర్ నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొది.

10 శాతం అదనపు ట్యాక్స్

బార్ లైసెన్సులపై 20 శాతం మేర కొవిడ్ ఫీజు విధింపుతో 40 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. దీంతో పాటు బార్ లలో మద్యం విక్రయాలపై 10 శాతం మేర అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ విధించటం వల్ల మరో 300 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి : 'రోడ్ల అభివృద్ధి టెండర్లలో అనుమనాస్పద లావాదేవీలు లేవు'

Last Updated : Sep 19, 2020, 3:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.