ETV Bharat / city

Amaravathi: అమ్మో... ఆ కేసు వాదించినందుకు అంత ఫీజా..!

author img

By

Published : Jun 22, 2021, 7:17 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికర జీవో విడుదల చేసింది. రాజధాని రైతు పరిరక్షణ సమితితో పాటు ఇతరులు దాఖలు చేసిన కేసుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డికి 88 లక్షల రూపాయలను ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

న్యాయవాదికి ప్రభుత్వం చెల్లింపులు
న్యాయవాదికి ప్రభుత్వం చెల్లింపులు

అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వ్యతిరేకంగా... రాజధాని రైతు పరిరక్షణ సమితితో పాటు ఇతరులు దాఖలు చేసిన కేసుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో దాఖలైన ఈ కేసులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించినందుకు గానూ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డికి 88 లక్షల రూపాయలను ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ సీఆర్డీఏకు చెందిన నిధుల నుంచి ఈ చెల్లింపులు చేస్తూ... ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది ఆగస్టు 4 తేదీ నుంచి 2020 డిసెంబరు 14 తేదీ వరకూ 20 రోజుల పాటు ఆయన హైకోర్టులో హాజరైనందుకు గానూ రూ.88 లక్షలను చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టులో ఆయన ఈ కేసుల నిమిత్తం హాజరైనందుకు గానూ ఒక్క రోజుకు 4 లక్షల 40 వేల రూపాయల చొప్పున 20 రోజులకూ ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఇదీ చదవండీ... సీఎం జగన్​పై తెలంగాణ మంత్రులు ఫైర్.. ఏమన్నారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.