ETV Bharat / city

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 13, 2020, 7:52 AM IST

Updated : Jul 13, 2020, 9:43 AM IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా వైరస్ నిర్ధరణ అయింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్​గా తేలడంతో తిరుపతి స్విమ్స్​కు చేరుకున్నారు.

cm amjad basha tested positive for coronavirus
cm amjad basha tested positive for coronavirus

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి (స్విమ్స్‌) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్‌ సంచాలకురాలు భూమా వెంగమ్మ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం అంజాద్​ బాషా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్లు ఆమె తెలిపారు. యశోదా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

గహ్లోత్​కు టాటా చెప్పిన పైలట్.. ఏం జరగనుంది?

Last Updated : Jul 13, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.