ETV Bharat / city

ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్

author img

By

Published : Apr 13, 2021, 11:33 AM IST

Updated : Apr 13, 2021, 3:16 PM IST

ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు.

ugadi celebrations 2021
cm jagan participated in ugadi celebrations

ఉగాది వేడుకల్లో సీఎం జగన్

ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. క్యాంపు కార్యాలయంలో..రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని.. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు.

మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ పంచాగ శ్రవణాన్ని ఆలకించారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళికలు, ఆర్థిక వృద్ధి ఉంటుందని పంచాంగ శ్రవణకర్త సుబ్బరామ సోమయాజులు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఫలితాలు బాగున్నాయన్నారు. గురుడు, వరుణుడి అనుగ్రహం కారణంగా వర్షాలు పడి వ్యవసాయం బాగుంటుందని పంచాంగ శ్రవణంలో వెల్లడించారు.

పంచాగ పఠనం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అర్చకులను ముఖ్యమంత్రి సత్కరించారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని, ప్రభుత్వం రూపొందించిన క్యాలెండర్​ను సీఎం ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

జమ్మలమడుగు వైకాపాలో స్నేహ గీతం.. రామసుబ్బారెడ్డి ఇంటికి ఆ ఇద్దరు..!

Last Updated : Apr 13, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.