రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు ప్రజలందరికీ 2021లో అన్నీ శుభాలే కలగాలని.. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి విధానాలు, సంక్షేమ పథకాలు నూతన సంవత్సరంలోనూ కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు