ETV Bharat / city

తెలంగాణలో.. మరో 120 పోస్టాఫీస్ కేంద్రాల్లో ఆధార్ అప్ డేట్

author img

By

Published : Mar 13, 2021, 7:31 AM IST

ఆధార్​ కార్డులో పుట్టినతేదీ, వేలి ముద్రలు, వయసు తదితర వివరాలు అప్​డేట్​ చేసుకోవాలి అనుకునే వారికి గుడ్​ న్యూస్​. ఆ వివరాల అప్డే​ట్​ కోసం.. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 120 పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ జనరల్ కోరారు.

another-chance-to-update-aadhaar-card-update-at-hyderabad
ఆధార్​ అప్​డేట్@120 పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాలు

కొత్త ఆధార్ నమోదు, పాత కార్డుల్లో సమాచారం అప్​డేట్ చేసుకోవటం కోసం తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో.. 120 పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలు ఉన్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు.

5 లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన వారు తప్పనిసరిగా వేలి ముద్రలను అప్​డేట్​ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సేవలను ఆయా కేంద్రాల్లో అందించనున్నట్లు వెల్లడించారు. సమాచారం అప్​డేట్ కోసం వచ్చేవారు రూ.50, వేలి ముద్రలు / ఐరిస్ సేవల అప్​డేట్ కోసం రూ.100 ఛార్జీ వసూలు చేయనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ వివరించారు.

ఇదీ చూడండి:

రీపోలింగ్ నిర్వహించాల్సిన స్థాయిలో ఘటనలేమీ జరగలేదు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.