ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు పై హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 18, 2021, 3:26 PM IST

Updated : Aug 18, 2021, 4:17 PM IST

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కార్పొరేషన్ రుణాలు తీసుకోవడంపై ధాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు పై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు పై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవటంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, హిమబిందులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయటం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.

కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం పొందే హక్కు కల్పించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని కన్సాలిడేట్ ఖాతాలో జమచేయకుండా నేరుగా ఏపీఎస్​డీసీకి మళ్లించటం సరికాదని వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 23 కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'సుప్రీం న్యాయమూర్తుల నియామకంపై వార్తలు బాధాకరం'

Last Updated : Aug 18, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.