ETV Bharat / city

కేబినెట్ భేటీ... మందడంలో పోలీసుల ముందస్తు చర్యలు

author img

By

Published : Nov 4, 2020, 9:14 PM IST

Updated : Nov 5, 2020, 5:19 AM IST

గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీకి సీఎం జగన్ మందడం మీదుగా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

andhra pradesh cabinet
andhra pradesh cabinet

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం జగన్ మందడం మీదుగా సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మందడం శిబిరానికి ఎవరూ రావొద్దని రైతులకు ఆదేశాలు జారీ చేశారు. 3 రాజధానుల మద్దతు శిబిరానికి ఎవరూ రాకుండా చూడాలని మందడం రైతులు కోరారు. ఆ శిబిరానికి ఎవరినీ అనుమతించకుంటే తామూ కూడా రాబోమని రైతులు స్పష్టం చేశారు. 3 రాజధానుల మద్దతుదారుల దీక్షకు అనుమతిచ్చి తమను రావొద్దంటే ఎలా అని పోలీసులను ప్రశ్నించారు.

ఇదీ చదవండి

యువతి కిడ్నాప్ కథ సుఖాంతం.. కానిస్టేబులే ప్రధాన నిందితుడు

Last Updated : Nov 5, 2020, 5:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.