ETV Bharat / city

amaravati farmers meeting: తిరుపతిలో సభకు అనుమతివ్వండి: అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక

author img

By

Published : Dec 4, 2021, 11:56 AM IST

amaravathi farmers meeting: ఈ నెల 17న అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక.. తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ఈ భారీ సభకు స్థలం కోసం అనుమతివ్వాలంటూ.. అమరావతి ఐకాస జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసింది.

amaravathi jac requests to give place for farmers meeting to be held in tirupathi
తిరుపతిలో సభకు స్థలం ఇవ్వండి: అమరావతి అమరావతి ఆకాస

amaravathi farmers meeting: రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ మేరకు తిరుపతి సమీపంలోని రేణిగుంటలో.. ప్రైవేట్ స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్లు అమరావతి ఐకాస తెలిపింది. సభకు అనుమతివ్వాలని జిల్లా ఎస్పీకి ఎన్ఓసీ సమర్పించినట్లు తెలిపారు.

ఈ బహిరంగ సభకు అన్ని రాజకీయ పక్షాల నేతలు హాజరుకావాలని ఆహ్వానాలు పంపుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.. రైతులకు సంఘీభావంగా ఈ మహాసభకు హాజరుకానున్నట్లు చెప్పారు.


ఇదీ చదవండి:

FARMER DEBTS: ఏపీలో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.