ETV Bharat / city

Capital Protest: 'అమరావతిని అభివృద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగండి'

author img

By

Published : Aug 20, 2021, 5:19 PM IST

అమరావతిని అభివద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగండి'
అమరావతిని అభివద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగండి'

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 612వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని అభివృద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగాలని ముఖ్యమంత్రి జగన్​కు సూచించారు.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 612వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, మందడం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో రైతులు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. పాలకుల మనస్సు మార్చి...అమరావతి అభివృద్ధి చెందేలా చూడాలని పూజలు చేశారు. పెదపరిమిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు. అమరావతిని అభివద్ధి చేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

CM Jagan: పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా.. మెరుగైన వైద్యానికి ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.