ETV Bharat / city

అమరావతి పరిరక్షణ కోసం.. రేపు మహాపాదయాత్ర

author img

By

Published : Dec 11, 2020, 12:39 PM IST

అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి 365 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా.. అమరావతి పరిరక్షణకై ఈనెల 12న గుంటూరులో మహా పాదయాత్ర ను చేపడుతున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయేతర ఐకాస నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు.

amaravathi jac
amaravathi jac

అమరావతి పరిరక్షణ కోసం శనివారం గుంటూరులో మహా పాదయాత్ర చేపడుతున్నామని.. అమరావతి పరిరక్షణ నేత గద్దె తిరుపతిరావు చెప్పారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నిరసనలకు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు.

ఈ నెల 17తో రాజధాని రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి కానుంది. ఏడాది సందర్భంగా అమరావతి రాజకీయేతర ఐకాస కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రేపట్నుంచి 6 రోజులపాటు వివిధ రూపాల్లో రైతులు నిరసనలు తెలపనున్నారు. రేపు మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం నిర్వహణ, 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్ర, 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని ఐకాస నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.