ETV Bharat / city

నేడు రాజధాని గ్రామాల్లో బంద్‌

author img

By

Published : Oct 31, 2020, 8:21 PM IST

Updated : Nov 1, 2020, 3:21 AM IST

amaravathi
రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్

రాజధాని గ్రామాల్లో ఆదివారం సంపూర్ణ బంద్​కు అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. 'జైల్ భరో'లో పోలీసుల దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఐకాస స్పష్టం చేసింది. 29 గ్రామాల్లో బంద్‌ను విజయవంతం చేయాలని ఐకాస కోరింది.

అమరావతి పరిరక్షణ ఐకాస రాజధాని గ్రామాల్లో ఇవాళ బంద్​కు పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన జైల్ భరోలో మహిళా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కృష్ణాయపాలెంలోని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్​ను పాటించనున్నట్లు ఐకాస కన్వీనరు పువ్వాడ సుధాకర్ శనివారం తెలిపారు.

ఇదీచదవండి

ఉద్రిక్తతల నడుమ 'జైల్‌ భరో'... భారీగా అరెస్టులు

Last Updated :Nov 1, 2020, 3:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.