ETV Bharat / city

Protest: అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు: అమరావతి రైతులు

author img

By

Published : Feb 19, 2022, 9:27 AM IST

అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు
అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు

Amaravathi Farmers Protest: ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 795 రోజులుగా ఆందోళనలు చేస్తున్న గుంటూరు జిల్లా మోతడక రైతులు..ఇవాళ తిరుపతికి పాదయాత్రగా బయల్దేరారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు.

Amaravathi Farmers Protest: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ 795 రోజులుగా ఆందోళనలు చేస్తున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక రైతులు.. తిరుపతికి పాదయాత్రగా బయల్దేరారు. ఇవాళ ఉదయం మోతడక నుంచి ఆకుపచ్చ కండువాలు, జెండాలు పట్టుకొని పాదయాత్రను మొదలుపెట్టారు. "మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు".., "రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే" అంటూ నినాదాలు చేశారు. మార్గమధ్యంలో గుంటూరు నగరంలోని గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టి మొక్కు చెల్లించుకోనున్నారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. ఇకనైనా.. ప్రభుత్వం దిగొచ్చి మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

Amaravathi JAC: సీఆర్‌డీఏ కమిషనర్‌కు అమరావతి రాజధాని ఐకాస వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.