ETV Bharat / city

రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ సమన్వయం కోసం తాత్కాలికంగా ప్రత్యేక కార్యదర్శి

author img

By

Published : Jun 4, 2021, 3:49 PM IST

రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ సమన్వయం కోసం తాత్కాలికంగా ప్రత్యేక కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల సమన్వయ తాత్కాలిక ప్రత్యేక కార్యదర్శిగా ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్​ను ప్రభుత్వం నియమించింది.

రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ సమన్వయం కోసం తాత్కాలికంగా ప్రత్యేక కార్యదర్శి
రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ సమన్వయం కోసం తాత్కాలికంగా ప్రత్యేక కార్యదర్శి

ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ సమన్వయం కోసం తాత్కాలికంగా ప్రత్యేక కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో రైల్వేప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి పని చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తాత్కాలిక ప్రాతిపదికన రైల్వే ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి పోస్టు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల సమన్వయ తాత్కాలిక ప్రత్యేక కార్యదర్శిగా ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్​ను ప్రభుత్వం నియమించింది.

ఇదీ చదవండీ... Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.