ETV Bharat / city

పొరుగు రాష్ట్రాల ఆంక్షలపై ఏం సమాధానం చెబుతారు?

author img

By

Published : May 7, 2021, 1:31 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపారాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్440కే తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఏపీ నుంచి వచ్చే వారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని అచ్చెన్న ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఎన్440కే తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఏపీ నుంచి వచ్చేవారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఏపీ నుంచి వచ్చేవారు 14రోజులు క్వారంటైన్ లో ఉండాలని దిల్లీ సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజల ప్రాణాల కంటే జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలు జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అని ప్రశ్నించారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని హితవుపలికారు. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర మార్గదర్శకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.