ETV Bharat / city

'వాళ్లు ఆగం చేశారు.. ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా'

author img

By

Published : Feb 23, 2022, 8:57 PM IST

Young Woman Suicide in Alair : నలుగురు వ్యక్తులు తనను ఆగం చేశారని ఆరోపిస్తూ... ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్​లో నలుగురి పేర్లు రాసి... ఈనెల 18న పురుగుల మందు తాగింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... మంగళవారం రాత్రి మృతి చెందింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

యువతి ఆత్మహత్య
యువతి ఆత్మహత్య

Young Woman Suicide in Alair : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో దారుణం జరిగింది. తనపై నలుగురు వ్యక్తులు తనను ఆగం చేశారని సూసైడ్ నోట్ రాసి... ఆత్మహత్యకు యత్నించిన యువతి... మంగళవారం మృతి చెందింది. నలుగురు వ్యక్తులు యువతి ఈ నెల 18న పురుగుల మందు తాగి... ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితురాలు... మంగళవారం రాత్రి మృతి చెందింది.

యువతి సూసైడ్ నోట్
యువతి సూసైడ్ నోట్

గ్రామంలో బందోబస్తు...

యువతి ఆత్మహత్యకు కారణమైన ఆ నలుగురు వ్యక్తుల పేర్లను సూసైడ్ నోట్​లో రాసిందని పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పేర్లు సూసైడ్ నోట్​లో ఉన్నాయని వెల్లడించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ నలుగురు వ్యక్తుల్లో ఎంపీటీసీ భర్త, ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ ఆటో డ్రైవర్, ఓ పూల వ్యాపారి ఉన్నారని పోలీసులు తెలిపారు.

నివేదిక వచ్చాకే...

మృతురాలి తల్లి గతంలో మృతి చెందగా... తండ్రి కూలి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధం అవుతోంది. పోలీసులకు ఇప్పటివరకు ఫిర్యాదు అందకున్నా సుమోటోగా స్వీకరించి... దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి పోస్టుమార్టం నివేదిక వస్తే.. మరికొన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: విజయనగరంలో భారీ చోరీ.. 5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.