ETV Bharat / city

నిమజ్జనం వేళ నిండిన మెట్రో రైళ్లు.. రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య

author img

By

Published : Sep 10, 2022, 7:03 PM IST

METRO
హైదరాబాద్​ మెట్రో

Hyderabad Metro Latest News: గణేశ్​ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం మెట్రో రైళ్ల సమయం పొడిగించడంతో రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్​ మెట్రో ప్రకటించింది. అత్యధికంగా మియాపూర్​, ఎల్​బీ నగర్​ కారిడార్​లో ప్రయాణికులు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

Hyderabad Metro Latest News: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. నిన్న ఒక్కరోజులోనే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ పేర్కొంది. మియాపూర్- ఎల్​బీ నగర్ కారిడార్​లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గ్ కారిడార్​లో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్​లో 22 వేల మంది ప్రయాణించినట్లు హైదరాబాద్​ మెట్రో ప్రకటించింది.

గణేశ్ నిమిజ్జనం నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు అధిక సంఖ్యలో మెట్రోను వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్​లో 62 వేల ఫుట్​ఫాల్ నమోదైంది. ఖైరతాబాద్ స్టేషన్​లో 40 వేల మంది రైలు దిగగా.. 22 వేల మంది రైలు ఎక్కారు. గతంలో కరోనా కంటే ముందు మెట్రోలో 4 లక్షల ప్రయాణికులు సరాసరిగా రోజున ప్రయాణించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.