ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : May 31, 2021, 8:58 AM IST

ప్రధాన వార్తలు @ 9AM

top news
ప్రధాన వార్తలు

  • Cm Jagan : 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

రాష్ట్రంలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Anandayya Medicine : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఔషధంపై నేడు తుది నివేదిక రానుంది. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. గ్రామంలోకి స్థానికేతరులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మహిళా లోకో పైలట్లతో మోదీ సంభాషణ సంతోషాన్నిచ్చింది'

‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు చెందిన మహిళా లోకో పైలట్‌ జి.శిరీషను మన్‌కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించడం సంతోషంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడ విమానాశ్రయానికి.. జూన్‌ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. జూన్‌ 2వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భావస్వేచ్ఛకు డిజిటల్‌ సంకెళ్లు

డిజిటల్‌ మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికల్నీ కఠిన నిబంధనల చట్రంలో బంధించి నియంత్రించేలా ఐటీ చట్టం నియమాలను ఫిబ్రవరి 25న కేంద్రం 'నోటిఫై' చేసింది. ఐటీ చట్టంలోని 69ఏ-కు కఠిన నిబంధనల కోరలు తొడిగి, సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం పేరిట డిజిటల్‌ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛను హరించేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహూ!

ఇజ్రాయెల్​లో ప్రభుత్వ ఏర్పాటులో వరుసగా విఫలమవుతూ వస్తున్న ఆ దేశ ప్రధాని నెతన్యాహూ.. త్వరలో పదవిని వీడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాఠశాలపై దాడి- 200 మంది విద్యార్థుల అపహరణ

నైజీరియాలోని ఓ పాఠశాలపై దాడి చేసిన ముష్కరులు.. 200 మంది విద్యార్థులను అపహరించారు. చిన్నారులను రక్షించేందుకు క్షేత్ర స్థాయిలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పేటీఎం రూ.22,000 కోట్ల ఐపీఓ!

డిజిటల్​ చెల్లింపుల సంస్థ పేటీఎం తొలిసారిగా ఐపీఓకి రానుంది. రూ.22 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు కంపెనీ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఛాంపియన్స్‌ లీగ్‌ ఛాంప్‌ చెల్సీ

ప్రతిష్ఠాత్మక ఫుట్​బాల్​ టోర్నీ ఛాంపియన్స్​ లీగ్​లో చెల్సీ జట్టు విజయం సాధించింది. తొమ్మిదేళ్ల తర్వాత చెల్సీ ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • KRISHNA BIRTHDAY: సూపర్​స్టార్ కృష్టకే సొంతమైన ఆ ఘనతలు

విభిన్న పాత్రలు, వినూత్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్టైల్ సృష్టించి.. తెలుగు సినీ ప్రేక్షకులను దాదాపు ఐదు దశాబ్దాల పాటు సూపర్​స్టార్ కృష్ణ అలరించారు. ఈ క్రమంలో టాలీవుడ్​కు ఆయన ఏం పరిచయం చేశారు? ఎన్ని అద్భుతాలు సృష్టించారు అనే విశేషాల సమహారమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.