ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : May 25, 2021, 8:59 AM IST

....

top news
ప్రధాన వార్తలు

  • సీలేరు నదిలో ఎనిమిది మంది గల్లంతు.. చిన్నారి మృతదేహం లభ్యం!

విశాఖ జిల్లా సీలేరు న‌దిలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న రెండు నాటు ప‌డ‌వ‌లు ప్ర‌మాదానికి గుర‌య్యాయి. ప‌డ‌వ‌లు నీట మున‌గ‌డంతో 8 మంది గ‌ల్లంతు కాగా, వారిలో చిన్నారి మృత‌దేహం ల‌భ్య‌మైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో రుసుముల ఖరారు విషయంలో ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రుసుముల ఖరారులో చట్ట నిబంధనలు పాటించడంలేదంటూ కమిషన్‌ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గుంటూరు అర్బన్‌ ఎస్పీకి కోర్టు ధిక్కరణ నోటీసు పంపిన రఘురామ న్యాయవాది

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ ఆయన తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్‌.. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పదో తరగతి పరీక్షలు వాయిదా?

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల సమయం కావాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నష్ట నివారణపై భాజపా-ఆర్​ఎస్​ఎస్ దృష్టి!

దిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మధ్య జరిగిన సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా కట్టడిలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు నిరాశ కల్గిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైద్యరంగానికి సమూల చికిత్స

వైద్య ఆరోగ్య రంగ మౌలిక వసతులపై దృష్టి సారించాలని పది రోజుల క్రితం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దక్షిణాసియా దేశాలను హెచ్చరించింది. అత్యంత కీలకమైన విద్య వైద్యం మాత్రం ప్రభుత్వ బాధ్యతగానే ఉండాలని నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ గతంలోనే జ్ఞానబోధ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా పుట్టుకపై ఫౌచీ అనుమానాలు

కొవిడ్ సహజంగా వృద్ధి చెందిందంటే నమ్మకం కుదరడంలేదని అమెరికాలోని అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. వైరస్​ పుట్టుకపై దర్యాప్తు కొనసాగింపునకు ఆయన మద్దతు పలికారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాలి అధ్యక్షుడు, ప్రధానమంత్రి అరెస్టు

మాలి అధ్యక్షుడు, ప్రధాన మంత్రిని ఆర్మీ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్తర్‌ 'దెబ్బకు' క్రికెట్‌ మానేద్దాం అనుకున్నా..!

ఓ మ్యాచ్​లో పాక్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​.. విండీస్​ దిగ్గజ బ్యాట్స్​మన్​ బ్రియన్​ లారాను గాయపర్చిన సంఘటన గురించి వివరించాడు ఆ దేశ మాజీ సారథి డారెన్​ సామి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గెటప్ మారుతోంది.. అంచనాలు పెరుగుతున్నాయ్!

కథలు డిమాండ్‌ చేశాయంటే.. వేషధారణలపై మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు మన హీరోలు. కొన్నిసార్లు ఒకే సినిమాలో రెండు మూడు కోణాల్లో కనిపించాల్సి వస్తుంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.