ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : May 17, 2021, 8:58 AM IST

ప్రధాన వార్తలు @ 9 AM

top news
ప్రధాన వార్తలు

  • నేడు సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్​పై విచారణ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం

రమేశ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు జైలుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్రీకాళహస్తిలో వెయ్యి పడకల కొవిడ్ తాత్కాలిక ఆసుపత్రి

నావల్‌ డాక్‌ యార్డ్ సాంకేతికత సహాయంతో శ్రీకాళహస్తి పరిధిలో వెయ్యి పడకలతో తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రిని ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తౌక్టే ఎఫెక్ట్: రాష్ట్రంలో వర్షాలు.. అన్నదాతలకు నష్టాలు

తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాలవర్షం అన్నదాతలను నష్టపరచగా... పొలాలు, కళ్లాల్లో ఎండబెట్టిన పంటను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం- భక్తులకు నో ఎంట్రీ

చార్​దామ్​ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్​నాథ్​ ఆలయం నేడు తెరుచుకుంది. వేద మంత్రాలు, ప్రత్యేక పూజల నడుమ ఆలయ ద్వారాలను తెరిచారు పండితులు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మోదీ పర్యటనలో హింసకు కుట్ర- జమాత్ నేత అరెస్ట్​

జమాత్​ ఈ ఇస్లామి గ్రూప్ సీనియర్​ నేత షాజహాన్​ చౌధరిని బంగ్లాదేశ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గత మార్చిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్​ పర్యటన సందర్భంగా చిట్టగాంగ్​లో అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు . పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అఫ్గాన్​ నుంచి బలగాల ఉపసంహరణ తొందరపాటు'

అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను తొందరపాటు చర్యగా చైనా అభివర్ణించింది. శాంతి ప్రక్రియ, ప్రాంతీయ సుస్థిరతకు ఇది విఘాతమని పేర్కొంది. ఐరాస తగిన పాత్ర పోషించాలని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేటి నుంచే పసిడి బాండ్ల ఇష్యూ

నేటి నుంచి 2021-22 తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఇష్యూకు రానున్నాయి. 21వ తేదీ వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉండనున్నాయి. మే 25ను సెటిల్మెంట్ తేదీగా నిర్ణయించింది ఆర్థిక శాఖ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ టోర్నీ వాయిదా పడుతుందని ఊహించలేదు'

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నా ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపింది ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. ఈ సందర్భంగా ఈనాడుతో మాట్లాడిన ఆమె పలు విషయాలు పంచుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తారల నోరు తీపి చేసిన పూజాహెగ్డే

నటి పూజాహెగ్డే.. టాలీవుడ్​ నుంచి బాలీవుడ్​ వరకు పలువురు తారల నోరు తీపి చేసింది. వారందరికీ సహజ సిద్ధంగా పండించిన మామిడి పళ్లను పంపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.