ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : May 24, 2022, 3:00 PM IST

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

  • CBN LETTER: తమిళనాడు ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ.. దేని గురించంటే?
    CBN LETTER: తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎమ్మెల్సీ నెట్టాడు.. తలకు దెబ్బతగిలి డ్రైవర్ చనిపోయాడు : ఎస్పీ
    డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో ప్రాథమిక విచారణ ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించి.. ఇవాళ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాస్తవాలు బయటపెట్టిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వమే నిలిపివేసింది- సోము వీర్రాజు
    SOMU: ఉచిత బియ్యం పంపిణీపై ఎంపీ జీవీఎల్​ వాస్తవాలు బయటపెట్టిన తర్వాత... రాష్ట్ర ప్రభుత్వమే నిలిపివేసిందని, ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంగీకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బియ్యం సరఫరా నిలిపివేసి కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూసిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ATTACK: చెరువులో మట్టి అక్రమ తరలింపు... అడ్డుకున్న ఎస్సైపై దాడి..!
    ATTACK: మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీసులపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. చెరువులో మట్టి తవ్వుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులు అనుమతి ఇవ్వగా.. ఇదే అదనుగా వైకాపా నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తరలించారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలను నిలిపివేసినా.. వైకాపా నాయకులు ఆగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాక్​లోనే దావూద్​ ఇబ్రహీం.. ఈడీ చేతికి కీలక సమాచారం!
    Dawood Ibrahim in Karachi: అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆచూకీ లభించింది. పాకిస్థాన్​లోని కరాచీలోనే ఉన్నట్లు దావూద్​ మేనల్లుడు చెప్పాడని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో దావూద్​ అంశాన్ని కేంద్రం సీరియస్​గా తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కొత్త మంత్రి'పై సీఎం వేటు.. వెంటనే అరెస్ట్.. అసలేం జరిగింది?
    Bhagwant mann: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవి కోల్పోయిన పంజాబ్​ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్​ సింగ్లాను ఏసీబీ అరెస్ట్​ చేసింది. కేబినెట్​ నుంచి ఆయనను ముఖ్యమంత్రి భగవంత్​ మాన్ తొలగించిన కొద్దిసేపటికే అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతికి కూడా అవకాశం ఇవ్వమన్నారు సీఎం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారత్​-అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక'
    Modi japan visit: టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు మోదీ. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి మీద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు బైడెన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే...
    Gold Rate: మంగళవారం బంగారం, వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి రూ.52వేల 790 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.62,950 కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీ విలువ స్వల్పంగా తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాపం రిషభ్​ పంత్​.. అత్యాశకు పోయి రూ.కోట్లలో నష్టపోయాడు..
    టీమ్​ ఇండియా స్టార్​ ప్లేయర్​, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్​ పంత్ దారుణంగా మోసపోయాడు. గుడ్డిగా నమ్మి ఒక‌టి కాదు. రెండు కాదు.. ఏకంగా రూ.1.63 కోట్లను న‌ష్ట‌పోయాడు. తక్కువ ధ‌ర‌కు విలాస వంతమైన వస్తువులు వస్తాయని ఆశపడితే.. మొదటికే మోసం వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొడుకు అకీరా కోసం కలిసిన పవన్​కల్యాణ్-​రేణుదేశాయ్‌!
    పవన్​కల్యాణ్​.. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో క‌లిసి దిగిన ఒక ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. అయితే ఈ ఫొటో ఎక్కడ దిగారు? ఎందుకు దిగారో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.