ETV Bharat / city

ప్రధానవార్తలు @3PM

author img

By

Published : Nov 4, 2020, 3:03 PM IST

ప్రధానవార్తలు @3PM
ప్రధానవార్తలు @3PM

.

  • అగ్రిగోల్డ్ విచారణ త్వరగా తేల్చండి

అగ్రిగోల్డ్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభత్వం విజ్ఞప్తి చేసింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని కోరింది. అనుమతిస్తే బాధితులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఏలూరులో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

పశ్చిమగోదావరి జిల్లాలో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు మాజీ మేయర్‌ నూర్జహాన్‌ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆ ప్రజాప్రతినిధుల కేసులకు అధిక ప్రాధాన్యం'

ప్రజాప్రతినిధులకు సంబంధించి అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం పదవిలో ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు అమికస్ క్యూరీ హన్సారియా. నేతల పెండింగ్ కేసుల వ్యవహారంపై రాష్ట్రాల హైకోర్టులు అందజేసిన నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తూ ఈ సూచనలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గోదాములో భారీ పేలుడు- ఆరుగురు మృతి

గుజరాత్​ అహ్మదాబాద్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఎన్నికల్లో మోసం'పై సుప్రీంకు వెళ్తాం: ట్రంప్

అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తనకు సంబంధించినంత వరకు ఇప్పటికే తాము గెలిచామని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా

అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్​ల హవా కొనసాగిస్తూ.. మరోసారి నలుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున శాసనసభ్యులుగా బరిలోకి దిగిన డాక్టర్​ అమీ బెరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఖాలిస్తాన్​ సంస్థ బెదిరింపులపై స్పందించిన ఎన్​ఐఏ

లండన్​ వెళ్లే విమానాలపై దాడికి దిగుతామని 'జస్టిస్​ ఫర్​ సిక్కు' సంస్థ చేసిన బెదిరింపులపై స్పందించింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఈ మేరకు దిల్లీ పోలీసులు, విమానాశ్రయ సిబ్బందిని అలర్ట్ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అప్పులే శరణ్యంగా సగం కుటుంబాల జీవనం!

కరోనా కాలంలో మధ్య తరగతి వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు పోవడం, వేతనాల్లో కోతల వల్ల ఇల్లు గడవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాలన్ని ఓ సర్వేలో తేలాయి. సగటు మధ్య తరగతి కుటుంబాల్లో అప్పుల ధోరణిపై చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ శామ్యూల్స్ రిటైర్మెంట్

కరీబియన్ క్రికెటర్ శామ్యూల్స్.. కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పైచిలుకు పరుగులు చేసి, గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బాలీవుడ్​ నటుడు అనారోగ్యంతో కన్నుమూత

హిందీ చిత్రసీమలో సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫరాజ్ ఖాన్.. బుధవారం మరణించారు. నటి పూజా భట్ ఈ మేరకు ట్వీట్ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.