ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 3,660 మందికి పాజిటివ్‌

author img

By

Published : May 20, 2021, 10:59 PM IST

తెలంగాణలో కరోనా పెరుగుతూనే ఉంది. కొత్తగా 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263 చేరగా... తాజాగా 23మంది ప్రాణాలు కోల్పోయారు.

ts cases
తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,252 నమూనాలను పరీక్షించగా.. 3,660 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,44,263కు చేరింది. తాజాగా 23 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,060కి పెరిగింది.

గురువారం 4,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 574 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:

కరోనా 'గాలి'కి వెంటిలేషన్‌తో చెక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.