ETV Bharat / city

Topnews: ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Nov 29, 2021, 1:01 PM IST

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM

.

  • YSR CONGRESS MLA KOTAMREDDY SRIDHAR REDDY: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం

YSR CONGRESS MLA SOLIDARITY TO AMARAVATHI FARMERS: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతుల బస వద్దకు వెళ్లి... ఏ అవసరం వచ్చినా చెప్పండి, తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతుల పాదయాత్రను విమర్శిస్తున్న తరుణంలో... అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుగా మాట్లడటంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Embabing to Dollar Seshadri Dead Body: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్..

Embabing to Dollar Seshadri Dead Body: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్ చేసినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్​ పీవీ సుధాకర్​ తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • nellore rains: నెల్లూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • RAGHAVENDRASWAMY MATAM: మంత్రాలయంలోని 8 మంది ఉద్యోగులపై వేటు

DISMISSAL OF EMPLOYEES IN MANTHRALAYAM: కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో పనిచేస్తున్న 8 మంది మహిళా ఉద్యోగులపై వేటు పడింది. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం స్టోర్‌ రూమ్‌లో నుంచి చక్కెర దొంగిలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆందోళనల మధ్యే 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు లోక్​సభ ఆమోదం

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(Parliament winter sessions) తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్​సభలో సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అప్పటివరకు ఉద్యమ వేదికను వీడబోం: టికాయిత్​

పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై చర్చ జరిగే వరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్​(Rakesh tikait) స్పష్టం చేశారు. నూతన సాగు చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటులో కేంద్రం నేడు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఎన్​సీపీ మహిళా ఎంపీతో స్టెప్పులేసి అలరించిన శివసేన ఎంపీ రౌత్​

రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్​.. ఉత్సాహంగా స్టెప్పులేశారు. ముంబయిలోని ఓ సెవెన్ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. ఆయన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సంగీత్​లో ఈ దృశ్యం కనిపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఒమిక్రాన్​' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'

కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా సహా ఇతర కరోనా రకాల కంటే అత్యంత ప్రమాదకరమని ఇప్పుడే చెప్పలేమని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది(omicron variant). పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • IND vs NZ 1st Test: కివీస్ ఆచితూచి.. లంచ్ విరామానికి 79/1

IND vs NZ 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట లంచ్​ విరామానికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. ఓపెనర్ లాథమ్, బ్యాటర్​ సోమర్​విల్లే ఆచితూచి ఆడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • విక్కీ-కత్రినా పెళ్లి.. అతిథుల కోసం 45 హోటల్స్!

డిసెంబరు రెండో వారంలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం జరగనుంది! ఈ వేడుకకు వచ్చే గెస్ట్​ల కోసం భారీగా హోటల్స్​ బుక్​ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.