ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 1PM

author img

By

Published : May 22, 2020, 1:00 PM IST

.

1pm top news
1PM టాప్​ న్యూస్

  • రాష్ట్రంలో కరోనా కలవరం

రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,514కి చేరుకుంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • హైకోర్టులో మరో ఎదురు దెబ్బ

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటంపై ప్రభుత్వ జీవోను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • కీచక తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలు తట్టుకోలేక బాలిక ఇంటి నుంచి ఏలూరుకు పారిపోయింది. అక్కడ కూడా ఆ చిట్టితల్లిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • సచివాలయమే మసాజ్ కేంద్రం

ఆ వీఆర్వో ఏకంగా సచివాలయ కేంద్రాన్నే మసాజ్ కేంద్రంగా మార్చేశాడు...! అక్కడే విధుల్లో మహిళా వాలంటీర్స్​ ఉన్నా... ఏమీ పట్టనట్లు అతడి కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తితో మసాజ్ చేయించుకుంటూ సేద తీరుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మోదీ విహంగ వీక్షణం

పశ్చిమ బంగను అతలాకుతలం చేసిన అంపన్​ తుపాన్ ప్రభావాన్ని ప్రధాని మోదీ స్వయంగా సమీక్షించారు. ప్రభావ ప్రాంతాల్లో మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్​లో పర్యటించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • బోర్ కొట్టిందని...

​లాక్​డౌన్ వేళ పనిలేదని ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా.. కర్ణాటకలో ఓ రైతు అద్భుతం సృష్టించాడు. ఇరవై రోజుల్లో 40 అడుగుల లోతు బావి తవ్వేశాడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అమెరికాలో సంతాపంగా జెండా అవనతం

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఈ విషాదకర పరిస్థితికి సూచికగా అమెరికా జాతీయ జెండాను మూడు రోజులపాటు అవనతం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ నిర్ణయించారు​. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • కీలక అంశాలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్​ కీలక ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • క్రికెటర్ తల పోయిందట!

క్రికెట్​ టోర్నీలు జరగకపోయినా.. ప్రేక్షకులను తమ టిక్​టాక్​ వీడియోలతో అలరిస్తున్నారు కెవిన్ పీటర్సన్​, డేవిడ్​ వార్నర్​. తాజాగా ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ పీటర్సన్ తన ఇన్​స్టాలో ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అస్వస్థత

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.